Gopichand Aaradugula Bullet Review: రివ్యూ: ఆరడుగుల బుల్లెట్
గోపీచంద్-నయనతార జంటగా నటించిన ఆరడుగుల బుల్లెట్ ఎలా ఉందంటే
చిత్రం: ఆరడుగుల బుల్లెట్; నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు; కథ,కథనం: వక్కంతం వంశీ; సంగీతం: మణిశర్మ; ఛాయాగ్రహణం: బాల మురుగన్; కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు; నిర్మాత: తాండ్ర రమేష్; దర్శకుడు: బి.గోపాల్; బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా; విడుదల: 8 అక్టోబర్ 2021
ఏళ్ల తరబడి సెట్స్పై మగ్గే సినిమాలు కొన్ని ఉంటాయి. రకరకాల కారణాలతో ఎప్పుడో మొదలై, ఇంకెప్పుడో అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. అలాంటి చిత్రమే.. ‘ఆరడుగుల బుల్లెట్’. నాలుగేళ్లుగా పలుసార్లు విడుదల తేదీల్ని మార్చుకున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గోపీచంద్ కథానాయకుడు కావడం, బి.గోపాల్ దర్శకత్వం వహించడం, వక్కంతం వంశీ, అబ్బూరి రవి, మణిశర్మ తదితరులు ఈ సినిమాలో భాగం కావడంతో ఎంత ఆలస్యమైనా ఒకింత ఆసక్తిని రేకెత్తించింది. మరి చిత్రం ఎలా ఉందో చూద్దామా..
కథేంటంటే: నిజాయతీకి మారుపేరైన ఓ ప్రభుత్వ ఉద్యోగి మూర్తి (ప్రకాశ్రాజ్). అతడి కుమారుడే శివ (గోపీచంద్). కుటుంబంపై ప్రేమ తప్ప.. మిగతా బాధ్యతలేవీ పట్టని యువకుడు శివ. వయసొచ్చిన కొడుకు అలా ఏ పనీ లేకుండా తిరగడం తండ్రికి అస్సలు నచ్చదు. ఎంత చెప్పినా అతడిలో మార్పు రాదు సరికదా, నయనతో (నయనతార) ప్రేమలో పడతాడు. ఏం యోగ్యత ఉందని ప్రేమించావ్?అంటూ ప్రేయసి ముందే శివని అవమానిస్తాడు తండ్రి మూర్తి. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి పంపేస్తాడు. ఇంతలో కాశీ (అభిమన్యు సింగ్) అనే ఓ రౌడీ నుంచి మూర్తికి ముప్పు ఏర్పడుతుంది. అసలు వారిద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది? తన తండ్రి సమస్యల్లో ఉన్నాడని తెలిశాక శివ స్పందన ఏమిటి? తనని వద్దనుకున్న కుటుంబం కోసం ఎలా పోరాటం చేశాడనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: ట్రెండ్ మాటెలా ఉన్నా.. అన్నీ అనుకున్నట్టు కుదిరాయంటే మాస్ సినిమాలకి బాక్సాఫీసు దగ్గర తిరుగుండదు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘క్రాక్’ వరకూ కూడా ఆ విషయాన్ని తరచూ ఏదో ఒక సినిమా నిరూపిస్తూనే ఉంది. కథానాయకులు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో కూడిన మాస్ కథలపై మొగ్గు చూపుతున్నారంటే కారణం కూడా అదే. మాస్ కథల్లో లాజిక్ల గురించి ప్రేక్షకుడు కూడా అంతగా పట్టించుకోడు. హీరోయిజం మోతాదు ఎంతున్నా, పాట తర్వాత ఫైటు, ఆ తర్వాత ఓ కామెడీ సీన్ వంటి లెక్కలతో సన్నివేశాలు సాగుతున్నా ప్రేక్షకుడు ఓకే చేసేస్తాడు. కాకపోతే కథో, కథానేపథ్యమో ఏదో ఒక విషయం కొత్తగా ఉండాలనుకుంటాడు. ఈ సినిమాలో మాత్రం అవేవీ కనిపించవు. కథ మొదలుకొని కామెడీ సన్నివేశాల వరకూ ప్రతిదీ.. ఎన్నో సినిమాల్లో చూశాం అన్నట్లుగానే ఉంటుంది.
తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. తండ్రి చీవాట్లు పెట్టడం, కొడుకు పడటం, పట్టించుకోకుండా తిరగడం, ఆ తర్వాత కథానాయికతో ప్రేమలో పడటం.. ఇలా సగటు తండ్రీ కొడుకుల సినిమాల్లాగే సాగుతుంది. అందులో కొత్తదనమేమీ లేదు. కథానాయకుడి తండ్రికి.. రౌడీ నుంచి సమస్య వచ్చినప్పుడే అసలు కథ మొదలైనట్టు అనిపిస్తుంది. కానీ, ఆ ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని బలంగా ఆవిష్కరించలేకపోయారు. ఆ రౌడీ పాత్రలో ఏమాత్రం బలం లేకపోవడంతో హీరోయిజం కూడా నీరుగారిపోయినట్టైంది. ప్రేమ సన్నివేశాల్లోనూ, కామెడీ ట్రాకుల్లోనూ కొత్తదనం లేదు. కుటుంబ నేపథ్యం అన్నప్పుడు భావోద్వేగాలు కీలకం. కానీ తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో భావోద్వేగాలు పండలేదు. కొద్దిలో కొద్దిగా గోపీచంద్ - నయనతార జోడీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. గోపీచంద్ చేసే పోరాటాలు, ఆయన కనిపించే తీరు కూడా మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే: గోపీచంద్కి అలవాటైన పాత్రే. ఇందులో ఆయన మరింత హుషారుగా కనిపిస్తాడు. అందంగా కూడా కనిపించాడు. పోరాట ఘట్టాలతోనూ అలరించాడు. నయనతార పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆమె పాత్ర సాగుతుంటుంది. పాటల్లోనూ, కొన్ని ప్రేమ సన్నివేశాల్లోనూ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అలరిస్తుంది. ప్రకాశ్రాజ్కి ఈ పాత్ర కొత్తదేమీ కాదు. తనదైన శైలిలో ప్రభావం చూపించారు. అభిమన్యు సింగ్ విలనిజంలో పసలేదు. ఆ పాత్ర లోపమే అది. హాస్యనటులు ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్రెడ్డి ఇందులో కనిపిస్తారు. ఎమ్మెస్ నారాయణ పాత్రకి మరొకరితో డబ్బింగ్ చెప్పించడంతో అది అంతగా అతకలేదు. బ్రహ్మానందం కాలం చెల్లిన కామెడీ సన్నివేశాల్లో కనిపిస్తారు. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. బలమైన సాంకేతిక బృందమే పనిచేసింది. వక్కంతం వంశీ కథలోనూ, కథనంలోనూ బలం లేదు. అబ్బూరి రవి మాటలు అక్కడక్కడా పర్వాలేదనిపిస్తాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బి.గోపాల్ మేకింగ్ కథకి తగ్గట్టే ఉంటుంది. కథల్ని ఎంచుకోవడంలోనూ, కథనాన్ని నడిపించడంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ తరం ప్రేక్షకుల్ని మెప్పించలేమనే విషయం ఆయనకి మరోమారు అర్థమయ్యేలా చేస్తుందీ చిత్రం.
బలాలు
+ గోపీచంద్ - నయనతార జోడీ
+ ప్రథమార్ధం
+ పోరాట ఘట్టాలు
బలహీనతలు
- రొటీన్గా సాగే కథ, కథనం
- భావోద్వేగాలు
చివరిగా: గురి తప్పిన బుల్లెట్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!