Satyameva Jayate 2: మూడు పాత్రల్లో జాన్‌అబ్రహం

బాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు జాన్‌ అబ్రహం తన కొత్త చిత్రం ‘సత్యమేవ జయతే-2’లో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి కొనసాగింపు వస్తున్న చిత్రమే ఇది..

Updated : 22 Nov 2021 06:56 IST

బాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు జాన్‌ అబ్రహం తన కొత్త చిత్రం ‘సత్యమేవ జయతే-2’లో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ చిత్రానికి కొనసాగింపు వస్తున్న చిత్రమే ఇది.. మిలాప్‌ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న ఇది థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జాన్‌ అబ్రహం మాట్లాడుతూ ‘‘రైతు, ఇద్దరు బిడ్డల తండ్రి, పోలీసు అధికారి.. ఇలా మూడు పాత్రల్లో నటించడం చాలా కష్టంగా అనిపించింది. అయితే వాటిని తెరపై చూసుకున్నాక చాలా తృప్తిగా ఉంది. మొదటి సినిమాకు, దీనికి ఏ మాత్రం పోలిక లేదు’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని