Dhee 13 promo: మొన్న రష్మీ-దీపిక.. ఇప్పుడు సుధీర్‌- ఆది.. అదరగొట్టేశారుగా

అత్యధిక ప్రేక్షకాదరణతో దక్షిణాదిలోనే పేరుపొందిన డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ-13’. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా సుధీర్‌-ఆది, రష్మీ-దీపిక టీమ్‌ లీడర్లుగా వ్యవహరిస్తోన్న ఈ షోకి ప్రేక్షకుల్లో...

Published : 07 Nov 2021 01:36 IST

హైదరాబాద్‌: అత్యధిక ప్రేక్షకాదరణతో దక్షిణాదిలోనే పేరుపొందిన డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ-13’. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా సుధీర్‌-ఆది, రష్మీ-దీపిక టీమ్‌ లీడర్లుగా వ్యవహరిస్తోన్న ఈ షోకి ప్రేక్షకుల్లో విశేష స్పందన లభించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా కింగ్స్‌ ఇప్పుడు మరోసారి స్టేజ్‌పై హోరాహోరీగా పోటీ పడనున్నారు. వచ్చే బుధవారం ప్రసారం కానున్న ‘ఢీ-13’ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ సరికొత్త ప్రోమో ఇప్పుడు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా గతవారం జరిగిన ఎపిసోడ్‌లో క్వీన్స్‌ టీమ్‌ లీడర్లుగా ఉన్న రష్మీ-దీపిక తమ డ్యాన్స్‌తో అందర్నీ ఫిదా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఆది-సుధీర్‌.. స్పెషల్‌ డ్యాన్స్‌తో మెప్పించనున్నారు. వాళ్లిద్దరి డ్యాన్స్‌కి న్యాయనిర్ణేతలు ప్రియమణి, పూర్ణ ఫిదా అయ్యారు. మరోవైపు, సుధీర్‌-ఆదిలపై ప్రదీప్‌ వరుస పంచులతో అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇక, సాయి, శ్రవణ్‌ల పవర్‌ఫుల్‌ డ్యాన్స్‌కి స్టేజ్‌ దద్దరిల్లిపోయింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని