Lovestory: మనం ఏం చేయలేమని మాటలంటున్నరే: నాగచైతన్య
అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘లవ్స్టోరీ’ ట్రైలర్ వచ్చేసింది. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫీల్గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు....
మనసును హత్తుకునేలా ‘లవ్స్టోరీ’ ట్రైలర్
హైదరాబాద్: అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘లవ్స్టోరీ’ ట్రైలర్ వచ్చేసింది. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫీల్గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. సాయిపల్లవి కథానాయిక. మరో కొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం ఉదయం ‘లవ్స్టోరీ’ ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చైతన్య-సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి. తెలంగాణ స్టైల్లోని వారి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బిజినెస్లు చేయలేం.. మనతోని కాదని.. మాటలు అంటున్నరే’ అంటూ సాగే సంభాషణలు సినిమాలో నాగచైతన్య పాత్ర తెలియజేసేలా ఉన్నాయి. ‘బతుకు కోసం ఈ ఊరుకులాడటం మాత్రం నాతోని కాదింక. చస్తే చద్దాం.. కానీ, తేల్చుకుని చద్దాం’ అంటూ ట్రైలర్ చివర్లో నాగచైతన్య చెప్పే డైలాగ్ భావోద్వేగానికి గురి చేస్తోంది.
ఫీల్గుడ్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య మధ్యతరగతి అబ్బాయి పాత్ర పోషించారు. కుటుంబ పోషణ కోసం పట్నం వచ్చి డ్యాన్స్ మాస్టర్గా ఇరుగుపొరుగు వారికి క్లాసులు చెబుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అబ్బాయిగా ఆయన కనిపించనున్నారు. అదే సమయంలో సాయిపల్లవి సైతం బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగం వేటలో ఉన్న అమ్మాయిగా సందడి చేయనున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైన హీరోయిన్కి మధ్యతరగతి కుటుంబానికి చెందిన హీరోకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రేమ విజయం సాధించిందా? అనేది తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకూ వేచి చూడాల్సిందే. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్, రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).