ETV: ఈటీవీలో రంగుల రాట్నం
మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ ధారావాహిక 2011 జనవరి 31న ప్రారంభమైంది. అనతికాలంలోనే తెలుగు వారికి అభిమాన సీరియల్గా మారి, కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సీరియల్స్లో
ఈరోజు నుంచి ప్రతి రాత్రి 7:30గం.లకు
మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ ధారావాహిక 2011 జనవరి 31న ప్రారంభమైంది. అనతికాలంలోనే తెలుగు వారికి అభిమాన సీరియల్గా మారి, కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సీరియల్స్లో అగ్ర స్థానంలో నిలిచింది. అనేక అవార్డులు సాధించింది.
ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ ధారావాహిక బుధవారంతో ముగియనుంది. సుదీర్ఘ కాలం మహిళా లోకాన్ని విశేషంగా ఆకర్షించిన ఈ సీరియల్కు ‘శుభం’ కార్డు పడనుంది. అదే సమయంలో.. మరో విశేషం ఏమిటంటే..
మనసు- మమత
దశాబ్ద కాలం నుంచీ తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరిది. ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు, ప్రతిరోజూ రాత్రి 7:30గం.లకు ప్రసారమయ్యే ఈ ధారావాహిక ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈరోజు నుంచే ఈటీవీలో.. ప్రతి రాత్రి 7:30గం.లకు..
మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలోనే.. ‘మనసు మమత’ దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలోనే ‘రంగులరాట్నం’ అనే సరికొత్త ధారావాహిక ప్రారంభమవుతుంది. ఎంతో విజయవంతమైన ఈ కాంబినేషన్లో మరో కొత్త ధారావాహిక వస్తోందనగానే సాధారణంగానే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. అనుబంధాలకీ.. ఆర్థిక బంధాలకీ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రూపొందించిన ‘రంగులరాట్నం’ సీరియల్లో జాకీ, చంద్రశేఖర్, రాజశ్రీ, రాజేష్, గౌతమి తదితరులు నటించారు. స్క్రీన్ప్లే ఫణికుమార్ సమకూర్చగా.. కథ, దర్శకత్వం బాధ్యతలు అనిల్ కుమార్ నిర్వహించారు.
3304
ఈరోజుకి ‘మనసు - మమత’ పూర్తి చేసుకున్న ఎపిసోడ్ల సంఖ్య ఇది.
* ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈనాటి కాలంలో, మారిన పరిస్థితుల్లో.. మనుషుల మధ్య ప్రేమాభిమానాల కన్నా, డబ్బు-హోదాలే ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఓ యువతి ధైర్యంగా ఎలా ఎదుర్కొంది? ఆస్తుల కన్నా ఆప్తులే మిన్న అని ఎలా నిరూపించింది? అహంకారాన్ని, ఆత్మాభిమానంతో ఎలా జయించింది? అన్నదే ఈ ‘రంగులరాట్నం’’ అని వివరించారు. అడుగడుగునా భావోద్వేగాలతో, మనసును కట్టిపడేసే కథాకథనాలతో ‘రంగులరాట్నం’ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు.
* మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సీరియల్ని నిర్మిస్తున్న దీప్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మనసు మమత’ ధారావాహిక దాదాపు 12ఏళ్ల పాటు విజయవంతంగా ప్రసారమైందంటే.. దానికి ఈటీవీ యాజమాన్యం అందించిన సహకారం, ప్రేక్షకుల ఆదరాభిమానాలే కారణం. ఇంత సుదీర్ఘ కాలం ప్రేక్షకులతో కలిసి ప్రయాణం చేయడం వల్ల.. వాళ్ల అభిరుచులేంటి? ఎలాంటి కథల్ని ఇష్టపడతారన్నది మేము తెలుసుకోగలిగాం. ఇప్పుడిందుకు తగ్గట్లుగానే ట్రెండ్కు అనుగుణమైన ఓ సరికొత్త కథాంశంతో.. అన్ని వర్గాల మహిళలు మెచ్చేలా ‘రంగులరాట్నం’ ధారావాహికను తీసుకొస్తున్నాం. నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువుల నుంచి రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటాం కదా. అలాంటి అనేక అంశాలు, సంఘర్షణలే ‘రంగులరాట్నం’లో కనిపిస్తాయి. సీరియల్ చూసిన ప్రతి ఒక్కరూ ‘ఇవన్నీ మన జీవితాల్లో జరిగినవే కదా’ అని కచ్చితంగా అనుభూతి చెందుతారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు ఆత్మాభిమానం.. ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమన్నది దీంట్లో చూపించాం. ఇందులో ఉన్న ప్రతి పాత్ర చాలా బలంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోతుంది’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్