Puneet Rajkumar: ఇలా బతకాలి అనిపించిన నటుడు.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో పునీత్‌కి నివాళి!

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో.. ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ స్పెషల్‌ ఎపిసోడ్‌లో పునీత్‌ని స్మరించుకున్న నటులు..

Published : 15 Nov 2021 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈటీవీ’ వేదికగా ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవల్ని గుర్తుచేస్తూ ఓ కంటెస్టెంట్‌ అభినయించి హృదయాల్ని హత్తుకున్నారు. ‘దేవుడు చేయాల్సిన పనులన్నీ పునీత్‌ చేశారు. అందుకే.. నువ్వు భూమిపై ఏం చేస్తావ్‌? నా పక్కన కూర్చో అని ఆ దేవుడే ఆయన్ను తీసుకెళ్లాడేమో!’ అని ఇంద్రజ, ‘బతికితే ఇలా బతకాలిరా అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేసిన ఏకైక స్టార్‌ ’ అని ఆది.. పునీత్‌ రాజ్‌కుమార్‌ని కొనియాడారు. ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ పేరుతో రూపొందించిన ప్రత్యేక ఎపిసోడ్‌లో పునీత్‌ని స్మరించుకున్నారు. ఈనెల 21 ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో పునీత్‌కి నివాళులర్పించిన దృశ్యాలతోపాటు ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-12’ ఫేం షణ్ముఖ ప్రియ సింగింగ్‌ పెర్ఫామెన్స్‌, నటుడు రాజ్‌ తరుణ్‌ కామెడీ సన్నివేశాలు కనిపించాయి. మరి ఆడవాళ్లు కోరుకున్నట్టు వారికి ఆదివారం సెలవు లభించిందా? ఇంతకీ వారు సెలవు ఎవరిని అడిగారు? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని