Jai Bheem: ‘జై భీమ్‌’కు ఆస్కార్‌ గౌరవం

సూర్య కథానాయకుడిగా నటించిన ‘జై భీమ్‌’ చిత్రం ఓ అరుదైన  గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆస్కార్‌ అకాడెమీ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఉంచారు. ‘సీన్‌ ఎట్‌ ది అకాడెమీ’ విభాగంలో ఈ వీడియో ఉంది.

Updated : 19 Jan 2022 07:04 IST

సూర్య కథానాయకుడిగా నటించిన ‘జై భీమ్‌’ చిత్రం ఓ అరుదైన  గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆస్కార్‌ అకాడెమీ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఉంచారు. ‘సీన్‌ ఎట్‌ ది అకాడెమీ’ విభాగంలో ఈ వీడియో ఉంది. అకాడెమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమాకు సంబంధించిన వీడియోను ఉంచటం ఇదే తొలిసారి. దీంతో చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా కథాంశంతో జస్టిస్‌ చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాదు  విమర్శకులనూ మెప్పించింది. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని