Enemy Review: రివ్యూ: ఎనిమి
Enemy Review: విశాల్, ఆర్య కీలక పాత్రల్లో నటించిన ‘ఎనిమి’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: ఎనిమి; నటీనటులు: విశాల్, ఆర్య, ప్రకాశ్రాజ్, మృణాళిని రవి, మమతా మోహన్దాస్ తదితరులు; సంగీతం: తమన్, శ్యామ్; ఎస్ (నేపథ్య); ఎడిటింగ్: రేమాండ్ డేరిక్ క్రస్టా; సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్; నిర్మాత: ఎస్.వినోద్ కుమార్; రచన, దర్శకత్వం: ఆనంద్ శంకర్; విడుదల తేదీ: 04-11-2021
ఈసారి దీపావళి బరిలో అనువాద చిత్రాల జోరు కనిపించింది. రజనీకాంత్ ‘పెద్దన్న’గా పండగ బరిలో దిగగా.. ఆయనకు పోటీగా ‘ఎనిమి’(Enemy)తో రేసులోకి దిగారు విశాల్(vishal), ఆర్య(arya). ‘వాడు వీడు’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన రెండో చిత్రమిది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబు చేశారు దర్శకుడు ఆనంద్ శంకర్. పాటలు, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది?(Enemy telugu movie review) పండగ వేళ విజయపతాకం ఎగురవేసిందా?
కథేంటంటే: భరత్ కల్యాణ్ (ప్రకాశ్ రాజ్-Prakashraj) ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. తన కొడుకు రాజీవ్ (ఆర్య)ను పోలీసు చేయాలని కలలుకంటాడు. దీనికోసం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తుంటాడు. వాళ్ల పక్కింట్లోనే ఉండే సూర్య (విశాల్) కూడా భరత్ లక్ష్యం పట్ల ఆకర్షితుడవుతాడు. సూర్యలోని ప్రతిభను గమనించిన భరత్.. తన బిడ్డతో పాటే అతనికీ పోలీస్ శిక్షణ ఇస్తాడు. ఈ క్రమంలోనే సూర్య, రాజీవ్ మంచి స్నేహితులవుతారు. ఇద్దరి జీవితాలు లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో అనుకోకుండా భరత్ కల్యాణ్ హత్యకు గురవుతాడు. అనంతరం సూర్య, రాజీవ్ల దారులు వేరవుతాయి. అయితే కొన్నేళ్ల తర్వాత ఈ స్నేహితులిద్దరూ శత్రువులుగా ఎదురుపడాల్సి వస్తుంది. మరి వాళ్లిద్దరి శత్రుత్వానికి కారణమైన విషయం ఏంటి? అసలు భరత్ను హత్య చేసింది ఎవరు? ఈ కథలో అనీషా (మమతా మోహన్దాస్), అశ్విత (మృణాళిని రవి)ల పాత్రలేంటి? ఆఖరికి మిత్రులిద్దరూ కలిశారా?లేదా?అన్నది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే: సింగపూర్లోని లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో సాగే కథ ఇది. ఇద్దరు స్నేహితులు.. శత్రువులుగా మారితే ఏం జరిగింది? అసలు వాళ్లిద్దరూ అలా మారడానికి కారణమేంటి? ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో ఆఖరికి పైచేయి ఎవరిదైంది? అన్నది చిత్ర కథాంశం. విశాల్, ఆర్యల ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథకు చక్కటి యాక్షన్ హంగులు జోడించి ఆసక్తికరంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ఆనంద్ శంకర్. అయితే కథని రసవత్తరంగా నడపడంలో ఆది నుంచే ఇబ్బంది పడినట్లు కనిపించాడు. ప్రారంభంలో తొలి 20నిమిషాల్ని సూర్య, రాజీవ్ల ఫ్లాష్బ్యాక్ కోసం.. ఆ తర్వాత మరో 15నిమిషాల సమయాన్ని విశాల్ ఇంట్రడక్షన్ కోసమే తినేశాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా.. రొటీన్గా సాగడంతో ప్రేక్షకులకు సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మధ్యలో ప్రకాశ్రాజ్ హత్యోదంతం ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించినా.. ద్వితీయార్ధం కోసం ఆ ఎపిసోడ్ను అలా పక్కకు పెట్టాడు దర్శకుడు. విరామ సమయానికి ముందు రాజీవ్ లిటిల్ ఇండియాలోకి అడుగుపెట్టడం.. అతను చేయాల్సిన ఓ మర్డర్ ఆపరేషన్ను సూర్య అడ్డుకోవడంతో కథలో వేగం పెరుగుతుంది. ఇక ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డాక వచ్చే సన్నివేశాలు కాసేపు ఆసక్తిరేకెత్తిస్తాయి. అయితే సూర్యపై రాజీవ్ ద్వేషం పెంచుకోవడానికి వెనకున్న కారణం తెలిశాక.. ఈ మాత్రం దానికే ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది.
అయితే ప్రధమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో కథ కాస్త వేగంగా నడిచినట్లు అనిపించినా.. సూర్య, రాజీవ్ల మధ్య వచ్చే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ చాలా పేలవంగా అనిపిస్తాయి. మధ్యలో రాజీవ్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునే ఎపిసోడ్ కథకి కాస్త ఊపు తెచ్చినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో సూర్య - రాజీవ్ల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ ఎపిసోడ్ మరీ సుదీర్ఘంగా సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లవుతుంది. ఇక చివర్లో సినిమాని ముగించిన తీరు చూస్తే.. కథను ఇంత అర్ధాంతరంగా ముగించాడేంటి అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: విశాల్, ఆర్యలు మాత్రమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సూర్య, రాజీవ్లుగా ఇద్దరూ తమ తమ పాత్రలకు నూటికి నూరుశాతం న్యాయం చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి నటించారు. మమతా మోహన్దాస్, మృణాళిని రవిల పాత్రలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. తెరపై అలా వచ్చి పోతుంటారు తప్ప.. వారి పాత్రల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇక పాటలు మరీ ఇబ్బంది పెట్టాయి. కథ కాస్త వేగం పుంజుకుంటుంది కదా అనిపించిన ప్రతిసారీ పాటలు బ్రేకుల్లా అడ్డుపడ్డాయి. కథ విషయంలో ఆనంద్ పెద్దగా కసరత్తు చేయలేదనిపిస్తుంది. లాజిక్ లేకుండా ప్రతి సీన్ను తనకు నచ్చినట్లుగా పేర్చుకుంటూ వెళ్లిపోవడంతో.. ఎక్కడా ఓ అర్ధవంతమైన కథ చూసినట్లు అనిపించదు. ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను ట్రిమ్ చేసుకోవాల్సింది. అలాగే హీరోలిద్దరి మధ్య బలమైన సంఘర్షణను రాసుకోలేకపోయారు. తమన్ పాటలు ఏమాత్రం మెప్పించవు. శామ్.సిఎస్ నేపథ్య సంగీతం, రాజశేఖర్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపించాయి.
బలాలు
+ విశాల్, ఆర్య నటన
+ క్లైమాక్స్ ఫైట్
బలహీనతలు
- కథ.. కథనం.. పాటలు
- సాగతీత సన్నివేశాలు
చివరిగా: ప్రేక్షకుల పాలిట ‘ఎనిమి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
రాఖీభాయ్ లుక్లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి