Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Tollywood: లవ్స్టోరీ, మహాప్రస్థానం, పరిణయం సహా ఏయే చిత్రాలు థియేటర్, ఓటీటీల్లో అలరించనున్నాయంటే?
ఇంటర్నెట్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మొదలై సెప్టెంబరు చివరి వారంతో సుమారు రెండు నెలలు పూర్తికానుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా థియేటర్స్లో సినిమాలను ప్రదర్శిస్తున్నా, పూర్తి స్థాయిలో నడపలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో కొన్ని చిత్రాలు ఓటీటీకే సై అంటున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలేంటో చూసేద్దామా!
క్రేజీ ‘లవ్స్టోరీ’
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా ‘లవ్స్టోరీ’. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయకచవితికి తీసుకువస్తారని ప్రకటించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చివరి నిమిషంలో విడుదల తేదీని మార్చారు. ఎట్టకేలకు సెప్టెంబరు 24న ‘లవ్స్టోరీ’ విడుదల కానుంది. ఫీల్గుడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్కమ్ముల దర్శకత్వం వహించడం, నాగచైతన్య-సాయిపల్లవి కలిసి నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ‘సారంగదరియా’ పాట విపరీతంగా ట్రెండ్ అయింది. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారంగ్ దాస్, పుష్కర్ రామ్మోహన్లు నిర్మించిన ‘లవ్స్టోరీ’కి పవన్ సీహెచ్ స్వరాలు సమకూర్చారు.
మాస్ ఎంటర్టైనర్ ‘మరో ప్రస్థానం’
తనీశ్, ముస్కాన్ సేథి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. జానీ దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 24న ఈ చిత్రం విడుదలకానుంది. స్ట్రింగ్ ఆపరేషన్ నేపథ్యంలో సాగే కథ ఇది. విలన్ బృందం వరుస హత్యలు చేస్తుంటుంది. హీరో బృందం వాటిని చిత్రీకరించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. హత్యల్ని షూట్ చేసిన కెమెరా విలన్లకి దొరుకుతుంది. దాంతో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. చివరకు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓంకారేశ్వర క్రియేషన్స్, మిత్ర మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.
హారర్ థ్రిల్లర్ ‘సిండ్రెల్లా’
అతిథి పాత్రలు, ఐటమ్స్తో అలరిస్తున్న నటి రాయ్లక్ష్మి ఈసారి భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న చిత్రం ‘సిండ్రెల్లా’. ఎస్జే సూర్య సహాయకుడు వినో వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ హారర్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో రాయ్ లక్ష్మి మూడు భిన్న పాత్రల్లో నటిస్తోంది. అశ్వమిత్ర సంగీతం సమకూరుస్తున్నారు. కోవై సుబ్బయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘సిండ్రెల్లా’ డ్రెస్ వేసుకున్న తర్వాత రాయ్లక్ష్మికి ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
సాహసాల ‘జంగిల్ క్రూయిజ్’
సాహసయాత్రలతో కూడిన చిత్రాలను ఇష్టపడేవారి కోసం మరో హాలీవుడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్వేన్ జాన్సన్, ఎమిలి బ్లంట్, ఎడ్గర్ రమీజ్, జాక్ వైట్ హాల్ కీలక పాత్రల్లో నటించిన అడ్వెంచర్ ఫాంటసీ ఫిల్మ్ ‘జంగిల్ క్రూయిజ్’. జైము కొల్లెట్ సెరా దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఈ ఏడాది జులైలో అమెరికాలో విడుదలైంది. ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 24న అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు...
‘ఆహా’లో పరిణయం
దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘వరునె అవశ్యముంద్’. అనూప్ సత్యన్ దర్శకుడు. గతేడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. సురేశ్గోపి, శోభన కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ ‘వరునె అవశ్యముంద్’ను ‘పరిణయం’ పేరుతో తీసుకువస్తోంది. సెప్టెంబరు 24నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అల్ఫాన్స్ జోసెఫ్ స్వరాలు సమకూర్చారు.
ఆ ఓటీటీలో ‘ఆకాశవాణి’
రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరుకెక్కుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. పద్మనాభరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. థియేటర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. సోనీ లివ్ వేదికగా సెప్టెంబరు 24న స్ట్రీమింగ్ కానుంది.
ఎంఎక్స్ ప్లేయర్లో ‘పీఎం మోదీ బయోపిక్’
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సెప్టెంబరు 23 నుంచి ఎంఎక్స్ ప్లేయర్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 మే 24 విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వివేక్తో పాటు బొమన్ ఇరానీ, మనోజ్ జోషి, జరీనా వాహబ్, రాజేంద్ర గుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోదీ రాజకీయ జీవితం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
ఓటీటీలో సందడి చేయనున్న మరికొన్ని చిత్రాలు..
అమెజాన్ ప్రైమ్ వీడియో
* రామే అందాళుమ్- సెప్టెంబరు 24
* బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ - సెప్టెంబరు 24
* గోలియత్ - సెప్టెంబరు 24
* డెస్పికబుల్ మి - సెప్టెంబరు 25
నెట్ఫ్లిక్స్
* ఇంట్రూజన్ -సెప్టెంబరు 22
* మిడ్నైట్ మాస్-సెప్టెంబరు 24
* కోటా ఫ్యాక్టరీ2 -సెప్టెంబరు 24 (వెబ్సిరీస్)
జీ5
* అలాంటి సిత్రాలు -సెప్టెంబరు 24
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు