VIDYA BALAN: నేరుగా ఓటీటీలోకి ‘షేర్నీ’

బాలీవుడ్‌ స్టార్‌ విద్యాబాలన్‌ అటవీశాఖ అధికారిగా నటించిన చిత్రం ‘షేర్నీ’. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో జూన్‌ నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

Updated : 17 May 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ విద్యాబాలన్‌ అటవీశాఖ అధికారిగా నటించిన చిత్రం ‘షేర్నీ’. ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో జూన్‌ నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. టీ-సిరీస్‌, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై సంయుక్తంగా నిర్మితమైంది. కాగా.. ఈ సినిమా విడుదలకు సంబంధించిన వార్తను అమెజాన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ‘తన మార్కు వేసేందుకు షేర్నీ సిద్ధం.. జూన్‌లో ఆమెను కలుసుకుందాం’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఈ సినిమాలో శరద్‌ సక్సేనా, ముకుల్‌ చద్ధా, విజయ్‌ రాజ్‌, అరుణ్‌, బ్రిజేంద్ర కాలా, నీరజ్‌ కబి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో షేర్నీ(విద్యాబాలన్‌) ఒక నిజాయితీ గల అటవీశాఖ అధికారిగా మనిషి-జంతు సంఘర్షణ ప్రపంచంలో సమతల్యత తెచ్చేందుకు పోరాడుతూ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని