Punjab Politics: ‘కెప్టెన్’ని మార్చాలని 78మంది ఎమ్మెల్యేలు కోరారు: సూర్జేవాలా
పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్సింగ్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక అంశాన్ని వెల్లడించింది. పంజాబ్లో తమ పార్టీకి మొత్తం......
దిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక అంశాన్ని వెల్లడించింది. పంజాబ్లో తమ పార్టీకి మొత్తం 79 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 78మంది అమరీందర్ సింగ్ను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసినట్టు కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ మేరకు హైకమాండ్కు ఎమ్మెల్యేలు లేఖలు రాసినట్టు చెప్పారు. 78మంది ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన ఏ ముఖ్యమంత్రి అయినా తనకు తానుగా పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుందని అని సూర్జేవాలా పేర్కొన్నారు.
అయితే, రాష్ట్రంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తరచూ తలెత్తుతున్న విభేదాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్లో గత నెలలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తనను తీవ్రంగా అవమానాలకు గురిచేస్తోందని పేర్కొంటూ ‘కెప్టెన్’ తన సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత అనూహ్యంగా సిద్ధూ కూడా పీసీసీ చీఫ్ పదవి నుంచి వైదొలగడం.. అమరీందర్ సింగ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకే గుడ్బై చెప్పి సొంత కుంపటి పెట్టుకుంటానని ప్రకటించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పదవి ఉన్నా, లేకపోయినా వారిద్దరితోనే ఉంటా.. సిద్ధూ ట్వీట్
పదవి ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వెంటే తాను ఉంటానని పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. శనివారం మహాత్మా గాంధీ, లాల్బహుదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో ఆ ఇద్దరు మహా నేతల సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానని ట్వీట్ చేశారు. తనను ఓడించేందుకు ప్రతికూల శక్తులన్నీ కలిసి ప్రయత్నించినా .. ఒక రవ్వంత పాజిటివ్ ఎనర్జీ పంజాబ్ను, ప్రతి పంజాబీనీ గెలిపిస్తుందంటూ ట్విటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా