సరదాగా నా కొడుకు బెంజ్‌కారు నడిపాడు!

బెంజ్‌ కారు నడిపినంత మాత్రాన ఈఎస్‌ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడిని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు....

Updated : 19 Sep 2020 15:50 IST

తప్పుడు ప్రచారం మానుకోవాలన్న మంత్రి జయరాం

అమరావతి: బెంజ్‌ కారు నడిపినంత మాత్రాన ఈఎస్‌ఐ కుంభకోణంలో తన పేరును తీసుకొస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి జయరాం హెచ్చరించారు. తన కుమారుడు యువకుడని, అతడి స్నేహితుడు అడిగాడు కాబట్టే  సరదాగా ఆ కారు నడిపాడని జయరాం వివరించారు. బెంజ్‌ కారు బహుమానంగా ఇచ్చారంటూ తనపై అభియోగం మోపుతున్నారనీ.. 2019 డిసెంబర్‌లో కార్తీక్‌ కారు కొన్నాడని తెలిపారు. కానీ ఈ కేసు నమోదైంది 2020 జూన్‌లో అని చెప్పారు. బెంజ్‌కారు నడిపినంత మాత్రాన కుంభకోణంలో ఉన్నట్టేనా?అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని అయ్యన్నకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని