‘భాజపా అబద్ధాల్ని ఇలా వ్యవస్థీకృతం చేసింది’
కొవిడ్-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు............
మోదీ సర్కార్ విధానాలపై రాహుల్ ధ్వజం
దిల్లీ: కొవిడ్-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు. తాజాగా.. ‘భాజపా అబద్ధాల్ని వ్యవస్థీకృతం చేసిందం’టూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగుదేశాలతో వివాదాల విషయంలో మోదీ సర్కార్ తీసుకుంటున్న పిరికి చర్యలతో భవిష్యత్తులో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.
‘‘1. కరోనా నిర్ధారణ పరీక్షల్ని పరిమితం చేయడం.. మరణాల్ని తక్కువగా చేసి చూపడం ద్వారా కొవిడ్-19 విషయంలో..
2. జీడీపీని లెక్కించడానికి కొత్త పద్ధతిని అవలంబించడం ద్వారా..
3. మీడియాను బెదిరించడం ద్వారా చైనా ఆక్రమణ అంశంలో
భాజపా అబద్ధాల్ని వ్యవస్థీకృతం చేసింది’’ అని ట్విటర్ వేదికగా భాజపాపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ భాజపా సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితుల్ని చక్కబెట్టడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. భౌగోళిక రాజకీయాలు రాజ్యమేలుతున్న సమయంలో.. కేవలం మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాహుల్ శుక్రవారం ట్విటర్ వేదికగా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం