రిటైర్మెంటా..?ఆ మాట అనలేదు: నీతీశ్
‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉద్వేగంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దిల్లీ: ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజున జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఉద్వేగంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తాజాగా నీతీశ్ స్పష్టం చేశారు. ‘నేను రిటైర్మెంట్ గురించి మాట్లాడలేదు. అన్నీ బాగా ముగుస్తాయంటూ నేను ప్రతి ఎన్నికల చివరి ర్యాలీలో ఇదే మాట చెబుతాను. మరోసారి మీరు నా ప్రసంగాన్ని వింటే మీకు ఈ విషయం స్పష్టమవుతుంది’ అని వెల్లడించినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్నియాలో పాల్గొన్న ర్యాలీలో నీతీశ్ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారానికి ఇది చివరి రోజు. ఎల్లుండి చివరి దశ ఓటింగ్ జరగనుంది. ఇవే నా చివరి ఎన్నికలు. అన్నీ బాగా ముగుస్తాయి’ అంటూ మద్దతుదారులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. అయితే, అదో రాజకీయ జిమ్మిక్కంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. కాగా, ఆ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించి.. మహాకూటమి ఆశలపై నీళ్లు చల్లింది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ను అధికారానికి దూరం చేసింది. దాంతో వరసగా నాలుగోసారి నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 16న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్