నెలకే కూలిన బ్రిడ్జి.. ఎలుకలతో లింకేంటి?
బిహార్లో గోపాల్గంజ్ వద్ద గండక్ నదిపై నిర్మించిన పైవంతెన కూలిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించిన నెల రోజులకే నిర్మాణంలోని కొంత భాగం కూలిపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గోపాల్గంజ్- తూర్పు.....
పట్నా: బిహార్లో గోపాల్గంజ్ వద్ద గండక్ నదిపై నిర్మించిన పైవంతెన కూలిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించిన నెల రోజులకే నిర్మాణంలోని కొంత భాగం కూలిపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గోపాల్గంజ్- తూర్పు చంపారన్ను కలుపుతూ 1.4 కిలోమీటర్ల పొడవున రూ.264 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత నెల 16న దీన్ని సీఎం నితీశ్ ప్రారంభించారు. అయితే, బ్రిడ్జి కొంతభాగం బుధవారం కూలి నదిలో కొట్టుకుపోయింది.
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఘటన విపక్షాలకు ఇది ఆయుధంగా దొరికింది. ‘‘రూ.263.47 కోట్లతో 8 ఏళ్ల పాటు నిర్మితమైన బ్రిడ్జిని నితీశ్ ప్రారంభించిన 29 రోజులకే కూలిపోయింది. అంత ఆత్రుతగా ఎవరి మెప్పు పొందడానికి ఈ బ్రిడ్జిని ప్రారంభించారు’’ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. బ్రిడ్జిని నిర్మించిన కంపెనీని నిషేధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ విషయంలో ఎవరైనా నితీశ్ను ఎవరైనా అవినీతి పరుడని అంటారేమో.. ఆయన ఎలుకలు కూడా ఈ మొత్తం మద్యాన్ని తాగేస్తాయ్ తెలుసా’’ అంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా సైతం ఈఘటనకు ఎలుకలను నిందించలేం అంటూ దుయ్యబట్టారు.
అయితే, ఈ ఘటనపై రహదారుల శాఖ మంత్రి నంద కిశోర్ స్పందిస్తూ.. కూలింది కేవలం అప్రోచ్ శ్లాబ్ మాత్రమేనని, బ్రిడ్జికి ఏమీ కాలేదని తెలిపారు. గతంలో బిహార్లో పెద్దమొత్తంలో సీజ్ చేసిన మద్యం ఖాళీ అవ్వడంతో అప్పట్లో పోలీసులు ఎలుకలే తాగేశాయని పేర్కొన్నారు. అంతకుముందు 2017లో బిహార్లో సంభవించిన వరదలకు ఎలుకలే కారణమని అప్పటి మంత్రి పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ రెండు ఉదంతాలను ప్రస్తుతానికి జత చేస్తూ ఎలుకలను కూడా రాజకీయాల్లోకి లాగేశారన్నమాట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్