పోలింగ్‌ సామగ్రి పంపిణీ షురూ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సిబ్బందికి అధికారులు పోలింగ్‌ సామగ్రిని అందిస్తున్నారు. దీని కోసం...

Published : 01 Dec 2020 01:36 IST

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సిబ్బందికి అధికారులు పోలింగ్‌ సామగ్రిని అందిస్తున్నారు. దీని కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే బ్యాలెట్‌ బాక్సులు, స్ట్రాంగ్‌ రూములు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ చేపట్టనున్నారు. ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి జోన్లలో ఐదేసి డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శేరిలింగంపల్లి జోన్‌లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులు డీఆర్సీ కేంద్రాలకు వచ్చి సామగ్రిని తీసుకుంటున్నారు.  పోలింగ్‌ సామగ్రితోపాటు కరోనా కిట్లు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని