ఆ బాధితురాలు ఎవరికీ ఏమీ కాదు?
దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హాథ్రస్ హత్యాచార ఘటనను ఉద్దేశించి నేడు..........
హాథ్రస్ ఘటనను ఉద్దేశించి ఆదిత్యనాథ్పై రాహుల్ విమర్శలు
లఖ్నవూ: దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హాథ్రస్ హత్యాచార ఘటనను ఉద్దేశించి తాజాగా ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించారు. ఎవరూ అత్యాచారానికి గురికాలేదని యూపీ సీఎం, అక్కడి పోలీసులు పదే పదే అంటున్నారని ఆరోపించారు. అంటే ఆ బాధితురాలు వారికి ‘ఎవరూ కాదు’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా వారు ఆమెను లేక్కే చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘బాధితురాలు చెప్పినా పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు అంటున్నారు’ అన్న కోణంలో బీబీసీలో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని ట్వీట్కు జత చేశారు.
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. బాధిత కుటుంబాన్ని గతవారం రాహుల్ గాంధీ సహా ఆయన సోదరి ప్రియాంక గాంధీ పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే