కంగనకేనా భద్రత.. బాధితులకు లేదా?
హాథ్రస్ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది
హాథ్రస్ ఘటనలో కేంద్రంపై శివసేన విమర్శలు
ముంబయి: హాథ్రస్ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబయికి చెందిన ఓ కథానాయికకు ‘వై-ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం.. బెదిరింపులు ఎదుర్కొంటున్న బాధిత దళిత కుటుంబానికి ఎందుకు రక్షణ ఇవ్వట్లేదని ప్రశ్నించింది. ఈ మేరకు తమ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
‘హాథ్రస్ ఘటనలో బాధిత కుటుంబం బెదిరింపులు ఎదుర్కొంటూ భయంభయంగా బతుకుతోంది. అలాంటప్పుడు వారికి వై ప్లస్ భద్రత కల్పించమని డిమాండ్ చేయడంలో తప్పేముంది. మొన్నటికి మొన్న ముంబయిలో ఓ నటి(కంగనా రనౌత్)కి కేంద్రం వై ప్లస్ భద్రత ఇచ్చింది. కానీ హాథ్రస్ బాధిత కుటుంబానికి మాత్రం రక్షణ ఇవ్వట్లేదు. ఇది సమాన న్యాయం అనిపించుకోదు. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఇలాంటి న్యాయం ఎక్కడా లేదు’ అని శివసేన దుయ్యబట్టింది.
అంతేగాక, హాథ్రస్ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడంపై కూడా శివసేన అనుమానాలు వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం జ్యుడీషియల్ విచారణ కోరుతుంటే.. సీబీఐ దర్యాప్తు ఎందుకు అని ప్రశ్నించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతురాలి అంత్యక్రియలను హుటాహుటిన జరిపించారని ఆరోపించింది.
గత నెల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీస్ కూల్చివేత వ్యవహారంలో కేంద్రం ఆమెకు వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ముంబయి పోలీసుల నుంచి తనకు ప్రమాదం ఉందని కంగన వ్యాఖ్యలు చేయడంతో కేంద్రం ఆమెకు రక్షణ కల్పించింది. ఇదే వ్యవహారంపై సామ్నా ఇప్పుడు కేంద్రానికి చురకలంటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.