‘కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని’
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కానీ, సీఎం అశోక్ గహ్లోత్ బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో.........
రాజస్థాన్ సంక్షోభంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి
జైపుర్: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కానీ, సీఎం అశోక్ గహ్లోత్ బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని వారి పార్టీలో విలీనం చేసుకొని మోసం చేశారని ఆరోపించారు. గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన ఈ విలీనంపై గతంలోనే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో వేచిచూశామన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేదని లేదని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తేల్చి చెప్పారు.
రాజస్థాన్లో బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేశామని మాయావతి తెలిపారు. ఒకవేళ విప్ను ధిక్కరించినట్లైతే వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యే మదన్ దిల్వార్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. నేడు మరోసారి ఇదే విషయంపై కొత్తగా పిటిషన్ వేశారు.
ప్రారంభమైన కేబినెట్ భేటీ..
మరోవైపు సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. గవర్నర్ కల్రాజ్ మిశ్రా రెండోసారి కూడా అసెంబ్లీ నిర్వహణ ప్రతిపాదనల్ని తిప్పి పంపడంతో తదుపరి అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చిస్తోంది. ఎలాగైనా శాసనసభను సమావేశపరిచి బలనిరూపణ చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. కానీ, ఇప్పటికీ రెండు సార్లు గవర్నర్ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. తొలుత ఆరు అంశాలపై వివరణ కోరిన గవర్నర్.. రెండోసారి అదనపు సమాచారం కావాలని కోరుతూ కేబినెట్ సిఫార్సులని వెనక్కి పంపారు. విశ్వాస పరీక్షకు వెళ్లాలనే ఉద్దేశముంటే దాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్లో గవర్నర్ పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార భాజపా గవర్నర్ వ్యవస్థని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. భాజపా నియమించిన గవర్నర్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?