తుది శ్వాస దాకా వారి వెన్నంటే..: మమత
రైతులే భారతదేశానికి వెన్నెముక అని.. తన తుదిశ్వాస వరకు తాను, తన పార్టీ వారి వెన్నంటే ఉంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా ........
కోల్కతా: రైతులే భారతదేశానికి వెన్నెముక అని.. తన తుదిశ్వాస వరకు తన పార్టీ, తాను వారి వెన్నంటే ఉంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్ - జై కిసాన్’ నినాదాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 55 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన ఈ నినాదం దేశంలోని సైనికులు, రైతాంగానికి ఎంతో ఉత్తేజాన్ని, ప్రేరణను ఇవ్వడంతో పాటు రైతు సోదరులను గర్వపడేలా చేసిందన్నారు. సమాజానికి రైతన్నే వెన్నెముక అన్న దీదీ.. తమ రాష్ట్రంలో రైతుల వార్షిక సగటు ఆదాయాన్ని మూడింతలు చేసినట్టు తెలిపారు. 2011లో రైతుల వార్షిక ఆదాయం రూ.91వేలుగా ఉంటే 2018 నాటికి అది రూ.2.91లక్షలకు పెరిగిందని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు ఇదే నిదర్శనమన్నారు. రైతాంగం తరఫున తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని మమత స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే