Punjab Election 2022: ఆమ్ ఆద్మీ ‘మస్త్ కలందర్’.. జబర్దస్త్ వీడియో చూశారా..!
ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగం ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పంచుకోగా.. అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది......
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిని పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఎంపీ భగవంత్ మాన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆప్ సోషల్ మీడియా విభాగం ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పంచుకోగా.. అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సీఎం అభ్యర్థిని వెల్లడించేందుకు ఆప్.. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్ ‘హే బేబీ’ సినిమాలోని ‘మస్త్ కలందర్’ పాటను ఎంచుకుంది. ఇందులో నటించిన షారుక్ ఖాన్ను భగవంత్ మాన్తో పోల్చారు. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ముఖ్లను చరణ్జిత్ చన్నీ, నవజ్యోత్సింగ్ సిద్ధూగా.. విద్యాబాలన్ను సీఎం కుర్చీగా పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూ సీఎం కుర్చీ కోసం ప్రయత్నిస్తుంటే.. షారుక్ రూపంలో భగవంత్ మాన్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు. దీంతో అక్కడేఉన్న రాహుల్ గాంధీ తెల్లముఖం వేయగా.. అరవింద్ కేజ్రీవాల్ సంబురాలు చేసుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 485వేల మంది వీక్షించారు. దాదాపు ఎనిమిది వేల మంది లైక్ చేశారు.
పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఆప్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలతో టెలీఓటింగ్ నిర్వహించింది. ఇందులో 93శాతం మంది భగవంత్ మాన్నే సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 21.59లక్షల స్పందనలు వచ్చినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇందులో 93.3శాతం మంది భగవంత్ మాన్ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఈ స్పందన చూస్తుంటే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ తప్పకుండా విజయం సాధిస్తుందని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే పంజాబ్ తదుపరి సీఎం అవుతారు’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు