విమర్శలకు చెక్‌ పెట్టే ప్రయత్నంలో దీదీ..

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. నందిగ్రామ్‌లోని రెయ్‌పారా ప్రాంతంలో ఈ ఇళ్లు ఉన్నాయి....

Published : 23 Mar 2021 01:20 IST

నందిగ్రామ్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్న మమత

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. నందిగ్రామ్‌లోని రెయ్‌పారా ప్రాంతంలో ఈ గృహాలు ఉన్నాయి. ఏడాది కోసం ఓ ఇంటిని, ఆర్నెల్ల కోసం మరో ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు ఇళ్ల మధ్య దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే ఉంది.

మమతా బెనర్జీ బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటూ భాజపా అభ్యర్థి సువేందు అధికారి పదేపదే విమర్శలు చేస్తుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నందిగ్రామ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటానని, కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రకటించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని