UP Elections: యూపీ పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉంది: అఖిలేశ్ యాదవ్
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉందని సమాజ్వాది పార్టీ(ఎస్పీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రజలు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం గణతంత్ర దినోత్సవం
లఖ్నవూ: ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’గా ఉందని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రజలు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ.. భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ‘సగం ఆదాయం.. రెట్టింపు ద్రవ్యోల్బణం’తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వం సమాజాన్ని రెండు భాగాలుగా విభజించింది. కొంత మంది ప్రజలు క్రమంగా ధనవంతులవుతుంటే.. మరికొందరు నానాటికీ పేదరికంలోకి జారుకొంటున్నారు. మధ్యతరగతి ప్రజలు ఈ అసమానతల మధ్య నలిగిపోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి అన్నీ కష్టాలు.. ఇబ్బందులే. చివరికి సామాన్య ప్రజలు తమ భవిష్యత్తు కోసం బ్యాంకుల్లో దాచుకునే డబ్బుకు కూడా రక్షణ లేకుండాపోయింది’’అని భాజపా పాలనపై అఖిలేశ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో సానుకూల మార్పులు, అభివృద్ధి జరగాలంటే.. కొత్త ఉత్తరప్రదేశ్ను చూడాలనుకుంటే తమ పార్టీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
తాము ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని అఖిలేశ్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ప్రతి ఇంటికి 300యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉచిత సాగు నీటి సరఫరా, అన్ని రంగాల పంటలకు కనీస మద్దతు ధర, వడ్డీ లేని రుణాలు, బీమా, పింఛన్, ఏడాదికి రూ.18వేల ఎస్పీ పింఛన్, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ, ఐటీ రంగంలో కొత్తగా 22లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వఉద్యోగాల భర్తీ, కుల గణన వంటి హామీలన్నీ మేం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నా’’అంటూ అఖిలేశ్ తను రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహించబోతున్న ఈ ఎన్నికల ఫలితాలను మార్చి 10న వెల్లడిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కూటములుగా ఏర్పడుతూ, ఇతర పార్టీలపై విమర్శలు చేస్తూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM