ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ ఆమోదం

రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. దీంతో తోట త్రిమూర్తులు...

Updated : 14 Jun 2021 19:34 IST

అమరావతి: రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. దీంతో తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌ ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యేందుకు మార్గం సుగమమైంది. వీరంతా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు  కొనసాగిన సమావేశంలో నామినేటెడ్‌ అభ్యర్థులపై గవర్నర్‌కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని