భోజనంలోనూ మోసమేనా?: అయ్యన్న

క్వారంటైన్‌లో ఉన్న వారికి భోజనం పెట్టే విషయంలోనూ మోసమేనా? అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ..

Published : 18 Jul 2020 11:10 IST

విశాఖపట్నం: క్వారంటైన్‌లో ఉన్న వారికి భోజనం పెట్టే విషయంలోనూ మోసమేనా? అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మెనూలో ఉన్న విధంగా ఎవరికైనా భోజనం పెడుతున్నారా? అని నిలదీశారు. కొవిడ్‌ బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అనంతరం దారి ఖర్చులకు రూ.2వేలు ఇస్తామని ప్రకటించారు.. ఎవరికైనా ఇస్తున్నారా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ ఆసుపత్రులలో టెస్టింగ్‌ కిట్లు లేవన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆలలాడొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని