ఆస్పత్రి నుంచి దీదీ డిశ్చార్జ్
కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 48 గంటలపాటు.....
కోల్కతా: కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సినప్పటికీ.. ఆమె అభ్యర్థన మేరకు ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న మమత ఆస్పత్రి నుంచి వీల్చైర్లో బయటకొచ్చారు. అక్కడున్న వారి సాయంతో కారెక్కి తన నివాసానికి బయల్దేరారు. మరోవైపు మమతా బెనర్జీపై ‘దాడి’కి నిరసనగా శుక్రవారం టీఎంసీ కార్యకర్తలు నిశ్శబ్ద మార్చ్ చేపట్టారు.
సీఈసీకి టీఎంసీ ఫిర్యాదు
మమతా బెనర్జీపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్.. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ అరోడాను కలిసిన పార్టీ బృందం.. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని మెమోలు కూడా సమర్పించింది. గతంలో సోషల్మీడియా వేదికగా భాజపా నేతలు ముఖ్యమంత్రిపై బెదిరింపులకు పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది.
ఆదివారం మేనిఫెస్టో ప్రకటన..
దీదీ ఆసుపత్రిలో చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం కాళీఘాట్లోని తన నివాసం నుంచి సీఎం.. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది. అయితే ఘటన నేపథ్యంలో దాన్ని కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మార్చి 14 ఆదివారం రోజున మేనిఫెస్టోను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్