కేరళలో భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!
కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో కేరళకు చెందిన భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను ఉపసంహరించుకుంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో తీర్మానం పెట్టగా..
కొచ్చి: కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో కేరళకు చెందిన భాజపా ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర చట్టాలను ఉపసంహరించాలంటూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ గురువారం అసెంబ్లీలో తీర్మానం పెట్టగా.. భాజపా ఎమ్మెల్యే రాజగోపాల్ దానికి మద్దతు పలికారు. దీంతో ఆ తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ శ్రీరామకృష్ణన్ ప్రకటించారు. అయితే భాజపా ఎమ్మెల్యే ఈ తీర్మానానికి మద్దతు పలకడంతో కేరళ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
తీర్మానంపై చర్చ సమయంలో రాజగోపాల్ స్పందిస్తూ.. ‘ఈ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసం తెచ్చినవి. రైతులు మధ్యవర్తులతో సంబంధం లేకుండా పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టాలు రైతులకు తమ పంట ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునేందుకు సహకరిస్తాయి. ఈ చట్టాలను వ్యతిరేకించడం అంటే రైతుల ప్రయోజనాలకు అడ్డుపడటమే’ అని పేర్కొన్నారు. ఈవిధంగా మాట్లాడుతూనే... చివరకు ఓటింగ్ సమయంలో తీర్మానానికి మద్దతు పలికారు.
ఈ క్రమంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తీసుకున్నారా అని మీడియా ఎమ్మెల్యేను ప్రశ్నించగా..‘ప్రజాస్వామ్యంలో అందరం ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలి. మొండిగా వ్యవహరించకుండా కొన్ని సందర్భాల్లో రాజీపడటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. నేను అందరి ఏకాభిప్రాయంతో వెళ్లే ముందు నా అభిప్రాయాలను ప్రజల ముందు వెల్లడించాను. ఏదేమైనప్పటికీ ఈ తీర్మానాన్ని నేను సమర్థిస్తున్నాను’ అని రాజగోపాల్ తెలిపారు. ఇది పార్టీ అధికారిక అభిప్రాయమా అని ప్రశ్నించగా.. పార్టీ నిర్ణయం కాదంటూ బదులిచ్చారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం