మేం గెలిస్తే.. వ్యాక్సిన్ ఫ్రీ: భాజపా ట్వీట్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని భాజపా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. బెంగాల్లో ఈసారి భాజపా ....
బెంగాల్ భాజపా ట్వీట్.. టీఎంసీ కౌంటర్
కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని భాజపా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. బెంగాల్లో ఈసారి భాజపా అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ టీకా ఉచితంగానే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. భాజపా ట్వీట్పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మండిపడ్డారు. అవన్నీ తప్పుడు హామీలేనని కొట్టిపారేశారు. బిహార్ ఎన్నికల సమయంలోనూ ఉచితంగా టీకా ఇస్తామని భాజపా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికలు పూర్తయ్యాక అక్కడ ఏం జరిగింది? బెంగాల్లో మిగిలిన రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యే వరకూ భాజపా ఇదే చెబుతుంది.. ఎవరూ నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, ప్రస్తుత టీకా విధానంపై ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి లేఖలు రాశారు. వ్యాక్సిన్ విధానం మార్కెట్ శక్తులకు అనుకూలంగా, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకా పంపిణీ చేయాలని ఆమె ప్రధానిని కోరారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు వ్యాపారం చేయొద్దని మరో లేఖలో సూచించారు. మే 1 నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చని కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలందరికీ భాజపా ఉచిత వ్యాక్సిన్ హామీ ఇవ్వగా.. ఓటు వేయకపోతే టీకా ఇవ్వరా అంటూ టీకాను రాజకీయం చేయడంపై విపక్షాలు అప్పట్లో భగ్గుమన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం