Goa Election 2022: ‘చిదంబరం సర్..మీ ఓట్లు పోయాయనే ఏడుపు ఆపండి’
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.. గోవా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్, భాజపాల మధ్యే ప్రధాన పోటీ ఉందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), టీఎంసీలు కేవలం భాజపాయేతర...
పనాజీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం.. గోవా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్, భాజపాల మధ్యే ప్రధాన పోటీ ఉందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), టీఎంసీలు కేవలం భాజపాయేతర ఓట్లను మాత్రమే చీల్చుతాయన్న తన అంచనాను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ధ్రువీకరించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఒకవేళ గోవాలో హంగ్ ఏర్పడితే.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. సోమవారం చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గోవా ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న చిదంబరం.. పాలనలో మార్పు కోసం కాంగ్రెస్ను ఎన్నుకోవాలని రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు చిదంబరం వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు. ‘సర్.. మీ ఓట్లు పోయాయనే ఏడుపు ఆపండి’ అని ట్వీట్ చేశారు. ‘గోవావాసులకు ఎవరిమీదైతే నమ్మకం ఉందో వారికే ఓటేస్తారు. కాంగ్రెస్ కేవలం భాజపాకు మాత్రమే ఆశాకిరణం.. గోవావాసులకు కాదు. మీ 17 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది భాజపాకు మారారు’ అని చిదంబరం ట్వీట్లను ట్యాగ్ చేస్తూ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు! కాంగ్రెస్కు వేసిన ప్రతి ఓటు భాజపాకు భద్రంగా చేరుతుందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆప్ తొలిసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలోని మొత్తం 40 స్థానాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం