నరసరావుపేటలో వైకాపా, జనసేన వర్గాల ఘర్షణ

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో వైకాపా, జనసేనవర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో

Published : 20 May 2021 01:16 IST

గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో వైకాపా, జనసేనవర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో జరిగిన ఈ గొడవలో ఇరువర్గాల వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా.. ఇరు వర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై రెండు వర్గాల వారు  నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వైకాపా వర్గీయులే గొడవకు కారణమని జనసేన తరఫున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని సర్పంచి గౌషియా బేగం వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని