మోదీజీ.. నేను మీ పార్టీ కాదు..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్తో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై దీదీ తీవ్రంగా
‘రెండో సీటు’ వ్యాఖ్యలపై ప్రధానికి దీదీ చురకలు
కూచ్బెహార్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్తో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్డారు. తాను మరెక్కడా పోటీ చేయాల్సిన అవసరం లేదని, నందిగ్రామ్ నుంచి తన గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ నేపథ్యంలో గురువారం వరకు నందిగ్రామ్లోనే ఉన్న దీదీ.. ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. అక్కడి నుంచి కూబ్బెహార్ వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, భాజపా నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘మోదీజీ.. మరో సీటు నుంచి పోటీ చేయాలని మీరు సలహా ఇచ్చేందుకు నేను మీ పార్టీ సభ్యురాలిని కాదు’’ అని దుయ్యబట్టారు. నందిగ్రామ్ నుంచి తాను తప్పకుండా విజయం సాధిస్తానని, ఇందులో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తనతో పాటు కనీసం 200 మంది తృణమూల్ అభ్యర్థులు గెలవాలని అన్నారు. అందుకుని ప్రజలంతా టీఎంసీ అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 200 సీట్లకు పైగా గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీదీ విశ్వాసం ప్రకటించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బలగాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ను అమిత్ షా నియంత్రిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలు భాజపా తరఫున పనిచేస్తున్నాయని, రాత్రి వేళల్లో గ్రామాలకు వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్నాయన్నారు. అలాంటి వాళ్లకు భయపడొద్దని, తిరగబడాలని ప్రజలకు సూచించారు.
హావ్డా జిల్లా ఉలుబేడియాలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. మమతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘మమతా బెనర్జీని గద్దె దించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్ ప్రజలు ఆ కలను నెరవేరుస్తున్నారు. ఎప్పుడూ విజయం సాధించే భవానీపుర్ను ఎందుకు వదులుకున్నానా అని ఆమె ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె మరో నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయాలని అనుకుంటున్నారట. ఈ వదంతుల్లో నిజమెంత? మమత వివరణ ఇవ్వాలి. ఆమె ఎక్కడికి వెళ్లినా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని అన్నారు. అయితే, ప్రధాని వ్యాఖ్యలను తృణమూల్ తీవ్రంగా ఖండించింది. దీదీ మరో చోట నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.