CoronaVaccine ధర ఒకేలా ఉండాలి
కొవిషీల్డ్ టీకాకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మూడు రకాలుగా ధరలు నిర్ణయించడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి....
లఖ్నవూ: కొవిషీల్డ్ టీకాకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మూడు రకాలుగా ధరలు నిర్ణయించడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. కరోనా వ్యాక్సిన్ ధరల్లో ఏకరూపతను తీసుకొచ్చేలా కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా జరిగేలా కేంద్రం చూడాలంటూ ట్వీట్ చేశారు. ‘‘టీకా ధరలు ఒకేలా లేవు. కేంద్ర, రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలకు ఒక్కోవిధంగా ధరలు నిర్ణయించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యంచేసుకొని జాతీయ విధానాన్ని రూపొందించాలి. టీకా ధరల్లో ఏకరూపతను తీసుకొచ్చి అమలుపరచాలి. దేశ రాజధాని నగరం సహా పలు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో పరిశ్రమల్లో ఆక్సిజన్ వాడకాన్ని నిలిపివేయాలి. అత్యవసర ఔషధాల సరఫరాను పెంచడం పైనా కేంద్రం ప్రత్యేక దృష్టిసారించాలి’’ అని మాయావతి కోరారు.
కొత్త వ్యాక్సిన్ విధానం ద్వారా సీరమ్ ఇన్స్టిట్యూట్ కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400, ప్రైవేటు వైద్యశాలలకు రూ.600లకు టీకా అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒకే వ్యాక్సిన్కు మూడు ధరలా అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుపట్టారు. దేశంలోని 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి ఉచిత టీకా అందించడం నుంచి ప్రభుత్వం తప్పుకోవడమంటే యువత యోగక్షేమ బాధ్యతలను పూర్తిగా విస్మరించడమేనని పేర్కొంటూ ప్రధానికి నిన్న లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?