Telagnana Congress: 17న గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభ

ఈ నెల 17న గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటుపైఈ నెల 17న గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటుపై

Updated : 12 Oct 2022 15:38 IST

హైదరాబాద్‌: ఈ నెల 17న గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటుపై ఇటీవల చర్చించిన టీపీసీసీ నేతలు.. ఈ మేరకు శనివారం తేదీని ఖరారు చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి, చేవెళ్లలోని రావిర్యాలలో ఈ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తెరాస పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ‘దండోరా’ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని