‘మంత్రుల్ని కాపాడేందుకే పవార్ ప్రయత్నాలు’
మహారాష్ట్రలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయిందని రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన భాజపా
ముంబయి: మహారాష్ట్రలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయిందని రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ విమర్శించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన భాజపా నేతలతో కలిసి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో కరోనా, హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు సహా పలు అంశాలపై సీఎం ఉద్ధవ్ఠాక్రే నుంచి నివేదిక కోరాలని వారు గవర్నర్కు వినతి పత్రం అందించారు.
‘రాష్ట్రంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయింది. కేవలం అధికారం కోసమే వారు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంచలనం సృష్టించే సంఘటనలు జరుగుతున్నా సీఎం మౌనం వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పరిణామాలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం రెండు పర్యాయాలు మీడియా సమావేశం నిర్వహించారు. కానీ, ఆయన ఎంతసేపు తమ మంత్రులను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను సమర్పించిన పోలీసు బదిలీల కుంభకోణానికి సంబంధించిన అధికారిక సాక్ష్యాల విషయంలో నాపై కేసులు వేసినా భయపడేది లేదు. కోర్టుకు వెళ్లి అయినా నాకు నేను నిరూపించుకుంటా. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పరిస్థితుల గురించి ప్రభుత్వానికి కొంచెం కూడా బెంగ లేదు. ఇది ఉపన్యాసాలు ఇవ్వడానికి తగిన సమయం కాదు.. చర్యలు తీసుకోవాల్సిన సమయం’ అని ఫడణవీస్ విమర్శలు చేశారు.
మహారాష్ట్రలో ఇటీవల ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్వీర్ సింగ్ హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందిస్తూ.. పోలీసు అధికారుల బదిలీల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తన వద్ద కాల్ డేటా, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని సైతం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..