Uttarakhand polls: భాజపాలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు
ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు, విశ్రాంత కర్నల్ విజయ్ రావత్ భాజపాలో చేరారు. మరికొద్ది వారాల్లో ఉత్తరాఖండ్......
దిల్లీ: ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు, విశ్రాంత కర్నల్ విజయ్ రావత్ భాజపాలో చేరారు. మరికొద్ది వారాల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ బుధవారం ఆయన దిల్లీకి వెళ్లి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామితో పాటు పలువురు భాజపా నేతల సమక్షంలో కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. భాజపాలో చేరే అవకాశం కల్పించినందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత తన తండ్రి కూడా భాజపాతో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఎంతో ప్రత్యేకమైందనీ.. ఆయన చేసే పనులన్నీ దేశ ప్రగతి కోసమేనన్నారు. అదే తనను భాజపాలో చేరేందుకు ప్రోత్సహించిందని చెప్పారు. భాజపా పనితీరును అంతా మెచ్చుకొంటున్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు