సీఏఏ రద్దు తీర్మానానికి బెంగాల్ ఆమోదం
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సీఎం మమతా బెనర్జీ
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. దేశ ప్రజలను విడదీసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడగలిగే ధైర్యం తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చారు.
బెంగాల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పార్ధ ఛటర్జీ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ సీఏఏ కారణంగా దేశమంతా ఆందోళనకర వాతావరణం ఏర్పడిందన్నారు. దేశాన్ని విభజించేందుకు లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టానికి ఎంతమాత్రం మద్దతిచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ‘బెంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోను అమలు చేసేది లేదు. వీటి వల్ల ప్రజలు తమ దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు’ అని ఆమె అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీఏఏను తీసుకొచ్చిన నాటి నుంచి ఆమె దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆమె కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే పలుమార్లు ర్యాలీని నిర్వహించారు. పంజాబ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలు ఇటీవలే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ