ఆ ప్రచారంలో వాస్తవం లేదు: కొడాలి నాని
రాష్ట్రంలో పింఛన్లలో భారీగా కోత విధించారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 39లక్షల మంది పింఛన్లు ..
అమరావతి: రాష్ట్రంలో పింఛన్లలో భారీగా కోత విధించారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 39లక్షల మందికి పింఛన్లు అందేవని.. జగన్ సీఎం అయ్యాక 54లక్షల మందికి ఇస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఇంటింటికీ పింఛన్లు అందిస్తూ సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలతో కోటి మందికి పైగా తమ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందన్నారు. తెదేపా హయాంలో మూడంతస్తుల భవనం ఉన్నవారికి, అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారని.. వాటన్నింటినీ సమీక్షించి అక్రమంగా పొందుతున్న పింఛన్లను మాత్రమే ప్రభుత్వం తొలగించిందన్నారు. నిజమైన అర్హులకు పింఛను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎవరైనా అర్హులు ఉండి పింఛను రాకపోతే దరఖాస్తు చేసిన 72 గంటల్లో అందజేస్తామని నాని స్పష్టం చేశారు.
మా దృష్టిలో మండలి రద్దయింది
జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి లేదని కొడాలి నాని అన్నారు. ఆయన తన మాటతీరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరమైన ఎల్లో వైరస్ ఉందని.. అది చాలా భయంకరమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి చెప్పారు. రూ.25వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఖర్చు పెట్టిందని.. వాటికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రానికి తగిన సమయంలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయంలో వైకాపా ఎంపీలు కేంద్ర పెద్దలను కలిసి తగిన ఒత్తిడి తీసుకొస్తారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మా దృష్టిలో శాసన మండలి రద్దయింది.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా రద్దుకు ఆమోదం తెలుపుతుందని నాని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం