నా ఓఎస్డీపై కఠినచర్యలు తీసుకోండి:సిసోడియా
అవినీతి ఆరోపణల కింద అరెస్టయిన తన ఓఎస్డీ, ఐఎస్ అధికారి గోపాల్ కృష్ణ మాధవ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు...........
దిల్లీ: అవినీతి ఆరోపణల కింద అరెస్టయిన తన ఓఎస్డీ గోపాల్ కృష్ణ మాధవ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కోరారు. మరికొన్ని గంటల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిసోడియా వద్ద ఉన్న అధికారి అవినీతి ఆరోపణల కింద అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన సిసోడియా.. గోపాల్ కృష్ణని అరెస్టు చేయడం సమంజసమేనని.. వీలైనంత త్వరగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతన్ని ఎలాంటి తరుణంలో అరెస్టు చేశారన్న దానిపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. లంచం తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
ఓ పన్ను ఎగవేత కేసులో నిందితుల దగ్గరి నుంచి గోపాల్ కృష్ణ లంచం తీసుకున్నాడన్న ఆరోపణల కింద సీబీఐ ఆయన్ని గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఈ వ్యవహారంతో సిసోడియాకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలినట్లు సమాచారం.
మరోవైపు గోపాల్ కృష్ణ అరెస్టు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీపై భాజపా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. మనీష్ సిసోడియా తరఫున లంచం తీసుకుంటూ ఓఎస్డీ పట్టుబడ్డారంటూ తీవ్రంగా ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం లోక్పాల్ని ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. శనివారం దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్