ఆటో డ్రైవర్లే వీఐపీలు: ఆప్
దిల్లీ: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది.
ప్రమాణస్వీకారానికి సామాన్యులను ఆహ్వానించిన కేజ్రీవాల్
దిల్లీ: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంటేనే రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, వారి బంధువులే వీఐపీలుగా ఉంటారు. కానీ, దీనికి భిన్నంగా ఆమ్ఆద్మీ పార్టీ ఈసారి సాధాసీదా వ్యక్తులను వీఐపీలుగా ఆహ్వానిస్తోంది. ఆదివారం జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దాదాపు యాభైమంది సామాన్యులు కేజ్రీవాల్తో వేదిక పంచుకోబోతున్నట్లు ఆమ్ఆద్మీ నేత మనీష్ సిసోడియా వెల్లడించారు. రామ్లీలా మైదానంలో జరగబోయే ఈ కార్యక్రమానికి అట్టడుగువర్గాల వారిని ఆహ్వానించాలని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఆటో, అంబులెన్స్, బస్సు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ప్యూన్లు, మొహల్లా క్లినిక్ డాక్టర్లు, ఇలా వివిధ వర్గాలకు చెందిన యాభై మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్యే మాస్కో ఒలింపియాడ్లో పథకాలు సాధించిన విద్యార్థులు, ఉద్యోగ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను కూడా ఆహ్వానించామన్నారు. రేపు జరగబోయే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు కేజ్రీవాల్. అయితే వారణాసి పర్యటన దృష్ట్యా దీనికి హాజరు అవుతారా?లేరా?అన్నది ఇంకా ఖరారు కావాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా