UP Polls: అఖిలేశ్ ప్రభుత్వం వస్తే మళ్లీ గూండారాజ్: అమిత్ షా
ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. .....
మథుర: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. తాజాగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సతువా గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలకు ఆయనే స్వయంగా ప్రచార కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేశ్ యాదవ్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ గూండా రాజ్యమే వస్తుందని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ రెండూ వారసత్వ, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. గతంలో సమాజ్వాదీ సారథ్యంలోని ప్రభుత్వంలో గూండాలు రాజ్యమేలలేదా? బలవంతులు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదా? మహిళలు అవమానాలు ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. ఎస్పీ నేత అజంఖాన్పై నమోదైన కేసులకు సీఆర్పీసీలో సెక్షన్లు కూడా సరిపోలేదంటూ అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై విమర్శలు చేస్తున్న అఖిలేశ్కు దాని గురించి మాట్లాడే హక్కులేదన్నారు.
భాజపా తిరిగి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు చేయడంతో పాటు పారదర్శకంగా పాలన అందిస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం తమపై అవినీతి ఆరోపణలు చేయలేరన్నారు. భాజపాకు ముందు రాష్ట్ర ప్రజలు ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలను చూశారనీ.. కేవలం కులాల కోసమే వారు పనిచేశారంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వారి వద్ద ప్రణాళికలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి సారథ్యంలోనే యావత్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. భాజపా కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితమై పనిచేసే పార్టీ కాదనీ.. మొత్తం సమాజానికి చెందినదన్నారు. 2017లో రాష్ట్ర ప్రజలు కుల, వారసత్వ రాజకీయాలను తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమాజ్వాదీ పార్టీ మద్దతుదారుల ఇళ్ల నుంచి అఖిలేశ్ యాదవ్ నోట్ల కట్టలు బయటపడుతున్నాయనీ.. భాజపాపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేవన్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ హామీ ఇస్తున్న సమాజ్వాదీ పార్టీ గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామమందిరం, వారణాసిలో కాశీవిశ్వనాథ్ కారిడార్ను నిర్మిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ