Goa polls: గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం..నివారణకు ఏం చేస్తున్నాయంటే?
గోవాలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
పనాజీ: వచ్చే నెల గోవాలో అసెంబ్లీ ఎన్నికలు (Goa polls) జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. గెలిచిన తర్వాత సభ్యులు ఎక్కడ పార్టీ మారతారోనని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR)’ వివరాల ప్రకారం.. గోవాలో గత ఐదేళ్లలో 24 మంది ఎమ్మెల్యేలు అంటే అక్కడి అసెంబ్లీలో 60 శాతం సామర్థ్యానికి సమానమైన సభ్యులు పార్టీలు మారారు. ఈ నేపథ్యంలోనే పలు పార్టీలు ఫిరాయింపుల నివారణకు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.
కాంగ్రెస్.. దేవుడి ముందు ప్రమాణం..
దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ (Congress)కు ఈ రాష్ట్రంలోనూ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. భాజపా (BJP) అధికారంలో ఉన్న గోవాలో.. గత ఐదేళ్లలో కాంగ్రెస్ నుంచి అనేక మంది ఫిరాయించారు. దీంతో ఈసారి పార్టీ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి పార్టీ మారబోమని ముందుగానే హామీ తీసుకుంటోంది. అందుకోసం పార్టీ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించింది. ఈ మేరకు మొత్తం 34 మంది అభ్యర్థుల్ని వారి విశ్వాసాల మేరకు దేవాలయం, చర్చి, దర్గాకు తీసుకెళ్లి పార్టీ మారబోమని శనివారం ప్రమాణం చేయించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 40 శాసనసభ స్థానాలున్న గోవాలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లలో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అలాంటిది ప్రస్తుతం సభలో ఇద్దరు మాత్రమే ఉండడం గమనార్హం. 2019లో అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాలో చేరారు.
‘‘ప్రజల్లో విశ్వాసం కలిగించేలా అభ్యర్థులందరితో దేవుడి ముందు ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టాం’’ అని గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ తెలిపారు. అందుకోసం పనాజీలోని మహాలక్ష్మీ ఆలయానికి, బాంబోలిమ్లోని చర్చికి, బెటిం గ్రామంలోని దర్గాకు అభ్యర్థులను తీసుకెళ్లామని పేర్కొన్నారు. వీరితో పాటు పార్టీ అధిష్ఠానం తరఫున రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న పి.చిదంబరం సైతం వెళ్లడం గమనార్హం.
ఏడాది ముందే జాగ్రత్త!
అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించడం గోవాలో కొత్తేమీ కాదు. గత ఏడాది జనవరి 31న ‘గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP)’ సైతం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపాకు మద్దతునివ్వబోమని పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నాయకులతో ఏడాది ముందే ప్రమాణం చేయించింది. అయినప్పటికీ జీఎఫ్పీకి చెందిన జయేశ్ సల్గోవాంకర్ తర్వాత భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన శాల్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు. 2017లో మనోహర్ పారికర్ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ప్రభుత్వానికి జీఎఫ్పీ మద్దతుగా నిలిచింది. ఫలితంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ, 2019లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన తర్వాత జీఎఫ్పీ సభ్యులను సీఎం ప్రమోద్ సావంత్ మంత్రి వర్గం నుంచి తొలగించారు. దీన్ని పరాభవంగా భావించిన జీఎఫ్పీ నేత విజయ్ సర్దేశాయ్.. భాజపాతో చేతులు కలిపేది లేదని ప్రకటించి సభ్యులతో ప్రమాణం చేయించారు.
ఆప్ ఇలా..
మరోవైపు గోవా ఎన్నికల బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం ఫిరాయింపులను అరికట్టేందుకు ఇదే తరహా చర్యలు చేపట్టింది. పోటీ చేయనున్న తమ అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారబోమని ‘లీగల్ అఫిడవిట్’లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్