Punjab Elections: ఒక్క నంబర్కు అన్ని కాల్స్ అసాధ్యం.. ఆప్ది పచ్చి మోసం: సిద్ధూ
మరికొన్ని రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారం చేపట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)యేనని.. ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఈ విషయాన్నే పదే పదే చెబుతూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపికపై
అమృత్సర్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ సారి అధికారం చేపట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)యేనని.. ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఈ విషయాన్నే పదే పదే చెబుతూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎంపికపై ప్రజల అభిప్రాయం కూడా అడిగారు. ‘జనతా చునేగీ అప్నా సీఎం’ పోల్లో పాల్గొన్న వారిలో 93 శాతం మంది భగవంత్ మాన్ పేరును ప్రతిపాదించారట. దీంతో కేజ్రీవాల్ ఆయన్నే పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఆప్ నిర్వహించిన ఈ పోలింగ్ అంతా మోసమని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపిస్తున్నారు. ప్రజలను ఫూల్స్ చేయడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆప్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
‘‘పంజాబ్ సీఎం అభ్యర్థిపై టెలీపోలింగ్ కోసం ఆప్ పార్టీ ఒక్క నంబర్ మాత్రమే ఇచ్చింది. ఆ నంబర్కే 7 లక్షల వాట్సాప్ సందేశాలు, 21 లక్షల వాయిస్ కాల్స్, సందేశాలు వచ్చాయని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి పోలింగ్ కోసం చేసే కాల్స్కు కనీసం 15 సెకన్ల సమయం పడుతుంది. అంటే రోజులో 5,760 కాల్స్ మాత్రమే మాట్లాడగలరు. నాలుగు రోజుల్లో 23,040 కాల్స్ మాత్రమే వస్తాయి. కానీ, 21 లక్షల కాల్స్, సందేశాలు రావడం అసంభవం. ఈ గణాంకాలు చాలా గందరగోళంగా, సందేహాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి మోసపూరిత పోలింగ్తో ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోంది. పంజాబ్ ప్రజలను పూల్స్ చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు’’ అని సిద్ధూ ధ్వజమెత్తారు. ఆప్ నిర్వహించిన ఈ పోలింగ్పై తమ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని సిద్ధూ తెలిపారు. కాల్స్ హిస్టరీ పరిశీలించాలని, అందులో మోసం జరిగినట్లు బయటపడితే ఆప్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!