Kiren Rijiju: ‘ముందు మీ రక్షణశాఖ మంత్రి ఏం అన్నారో వినండి’
భారత్- చైనా సరిహద్దు వివాదంపై అమెరికా నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. దేశ రక్షణ వ్యవస్థ విషయంలో 2013లో అప్పటి...
కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిదాడి
ఇంటర్నెట్ డెస్క్: భారత్- చైనా సరిహద్దు వివాదంపై అమెరికా నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. దేశ రక్షణ వ్యవస్థ విషయంలో 2013లో అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ లోక్సభలో మాట్లాడిన వీడియోనూ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్ సభ్యుల్లారా.. చైనా సరిహద్దు విషయంలో మాట్లాడే ముందు మీ హయాంలోని రక్షణశాఖ మంత్రి మాట వినండి’ అని ట్వీట్ చేశారు. ‘అభివృద్ధి చెందిన సరిహద్దుల కంటే అభివృద్ధి చెందని సరిహద్దులే సురక్షితం అనే విధానాన్ని భారత్ ఏళ్లుగా పాటిస్తోంది. మరోవైపు సరిహద్దులో చైనా తన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది’ అంటూ ఆంటోని చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి.
‘మన సైన్యాన్ని నమ్మడం లేదు కానీ..’
‘అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని ఓ విదేశీ నివేదిక పేర్కొంది. కానీ.. ఆ నివేదికలోనే 1959లో చైనా ఆక్రమించిన ప్రాంతంలో అని రాసి ఉంది. మీరు కావాలనే మన సైన్యాన్ని నమ్మడం లేదు. కానీ.. దేశాన్ని నిరుత్సాహపరిచే దురుద్దేశంతో ప్రభుత్వ విశ్వసనీయతను, సైన్యం సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న ఓ కథనాన్ని పట్టించుకుంటున్నారు’ అని కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి రిజిజు విమర్శలు చేశారు. అమెరికా నివేదికను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ నేతలు శనివారం కేంద్రంపై విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. గతంలో చైనాకు ఇచ్చిన ‘క్లీన్ చిట్’ను ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి డిమాండ్ చేశారు. ఈ విషయమై క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్