దీదీ.. ఇప్పుడు దెబ్బతిన్న పులి: శివసేన

‘‘దెబ్బతిన్న పులి మరింత దూకుడుగా ఉంటుంది. వాడిగా పంజా విసురుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అలాంటి స్థితిలో ఉంది. ఆమె గాయం.. ప్రత్యర్థులకు

Published : 13 Mar 2021 01:22 IST

ముంబయి: ‘‘దెబ్బతిన్న పులి మరింత దూకుడుగా ఉంటుంది. వాడిగా పంజా విసురుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. ఆమె గాయం.. ప్రత్యర్థులకు భారంగా మారనుంది’’ అని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. మమతపై దాడి ఘటనపై స్పందించిన శివసేన.. తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో భాజపాపై ఘాటు విమర్శలు చేసింది. 

‘‘బెంగాల్‌ ఎన్నికల కోసం భాజపా తమ మొత్తం బలగాన్ని దించుతోంది.  మమతను రౌండప్‌ చేసే ఏ ప్రయత్నాలను వదలట్లేదు. దీంతో దీదీ పార్టీ రోజురోజుకీ విడిపోతుంది. అయినా ఆమె తన సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ పోరు.. దీదీ వర్సెస్‌ మోదీగా మారింది. దీంతో బెంగాల్‌లో ఏం జరిగినా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. కేవలం ఆడపులి మాత్రమే ధైర్యం ప్రదర్శించగలదు. అలాగే మమత కూడా సువేందు అధికారి సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌ బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు ఆమె దెబ్బతిన్న పులి. మరింత దూకుడుగా మారుతారు. అందుకే భాజపా కొంత ఆందోళనగా చెందుతోంది. ఎందుకంటే ధైర్యవంతమైన పులి ముందు నిలబడటానికి ఎవరూ సాహసించరు’’అని శివసేన రాసుకొచ్చింది. 

ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు చేసింది. మమత ఘటనలో సీబీఐ దర్యాప్తును భాజపా డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టింది. తాజా పరిణామాలతో భాజపా ఆందోళన చెందుతోందని, ఎందుకంటే దీదీ గాయం వల్ల నొప్పి భాజపాకేనని అభిప్రాయపడింది. కాషాయ పార్టీ దాదాపు 10 నుంచి 20 సీట్లు కోల్పోయే అవకాశముందని పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని