బండి సంజయ్‌ బాధ్యతగా మాట్లాడాలి: తలసాని

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్నింటికి హద్దులు

Updated : 02 May 2021 09:31 IST

హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్నింటికి హద్దులు ఉంటాయని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో బండి సంజయ్‌ చెప్పాలన్నారు. గతేడాది ప్రధాని చెప్పిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని.. బండి సంజయ్‌ నిజాలు తెలుసుకుని బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఈటల విషయం సీఎం కేసీఆర్‌ పరిధిలో ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని