Sidhu: ‘నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఆచూకీ చెబితే రూ.50 వేలు’

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ కనిపించడం లేదని అమృత్‌సర్‌లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అమృత్‌సర్‌ ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధూ.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి చేయడం లేదని ఆరోపిస్తూ ‘ధన్‌

Published : 03 Jun 2021 00:08 IST

అమృత్‌సర్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ కనిపించడం లేదని అమృత్‌సర్‌లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అమృత్‌సర్‌ ఈస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధూ.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి చేయడం లేదని ఆరోపిస్తూ ‘ధన్‌ ధన్‌ బాబా దీప్‌సింగ్‌ జీ’ అనే ఓ స్వచ్ఛందసంస్థ గోడలపై పోస్టర్లను అంటించింది. ఆయన జాడ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమానాన్ని కూడా ప్రకటించింది. 

సదరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అనిల్‌ కుమార్‌ విశిత్‌ బంటి మాట్లాడుతూ.. సిద్దూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్‌సర్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో ఆయన కనిపించడం లేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన రోడ్లపై చెత్త, మురుగు నీరు ప్రవహిస్తోందని, నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధిక చేయడం లేదని ఆరోపించారు. 

నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్దూ తప్పిపోయిన పోస్టర్లు వెలవడం ఇదే మొదటిసారి కాదు. పదేళ్ల క్రితం సిద్దూ భాజపా ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇదే తరహా పోస్టర్లు అమృత్‌సర్‌లో వెలుగుచూశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని