ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై టెన్షన్.. టెన్షన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగో రోజూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. హైదరాబాద్, నల్గొండ.. ఈ రెండు చోట్లా రెండో ప్రాధాన్య ఓట్ల......
నల్గొండలో కీలకంగా మారిన కోదండరాం ఓట్లు
హైదరాబాద్/నల్గొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగో రోజూ ఉత్కంఠగా సాగుతోంది. ‘హైదరాబాద్’లో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ‘నల్గొండ’లో తుది అంకానికి చేరింది. మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. అయితే, హైదరాబాద్లో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తవ్వగా.. నల్గొండలో ప్రొఫెసర్ కోదండరామ్కు తొలి ప్రాధాన్య ఓట్లు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో ఇప్పటివరకు మొత్తం 93మంది అభ్యర్థుల్లో 91 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే.. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా.. రామచంద్రరావుకు 1,37,566 ఓట్లు వచ్చాయి. కె.నాగేశ్వర్కు 67,383 మొత్తంగా ఓట్లు వచ్చాయి. వాణీదేవి ప్రస్తుతం తన ప్రత్యర్థి రామచంద్రరావుపై 11,703 ఓట్ల ఆధిక్యంతో నిలిచారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు రావాల్సి ఉంటుంది.
మరోవైపు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటిదాకా 67మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 11,799 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 15,817, కోదండరామ్కు 19,335 ఎలిమినేషన్ ఓట్లను బదిలీ చేశారు. దీంతో ఇప్పటిదాకా పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి మల్లన్నపై 23,432 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,22,639 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 99,207 ఓట్లు, కోదండరామ్కు 89,407, భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 44,010 ఓట్లు చొప్పున వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ పూర్తికాగా.. ప్రస్తుతం భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు రావాల్సి ఉంటుంది. రెండు చోట్లా తెరాస అభ్యర్థులే తొలి నుంచీ ఆధిక్యం కనబరుస్తున్నప్పటికీ రెండో ప్రాధాన్య ఓట్లలో ఎవరు పైచేయి సాధిస్తారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్