Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మోదీ మరింత పవర్ఫుల్.. దీదీ విమర్శలు
రాజకీయాల పట్ల కాంగ్రెస్ సీరియస్గా ఉండట్లేదని, అందుకే ప్రధాని మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
పనాజీ: రాజకీయాల పట్ల కాంగ్రెస్ సీరియస్గా ఉండట్లేదని, అందుకే ప్రధాని మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించట్లేదని దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్ రాజకీయాలను సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ పార్టీ వల్లే మోదీజీ మరింత శక్తిమంతంగా మారుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్.. భాజపాకు టీఆర్పీగా మారుతోంది. ఇప్పటికైనా వారు(కాంగ్రెస్) నిర్ణయం తీసుకోకపోతే.. యావత్ దేశం బాధపడాల్సి వస్తుంది. వారికి గతంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, వారు భాజపాపై పోరాటం చేయాల్సింది మాని.. మా రాష్ట్రంలో నాపై పోటీ చేశారు. అలాంటప్పుడు మేం వారితో ఎలా చేతులు కలపగల్గుతాం’’ అని మమత విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీల గురించి దీదీ ప్రస్తావించారు. ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా మారాలని, అప్పుడే దేశ ఫెడరల్ వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని అన్నారు. భాజపాను ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.