Suvendu Adhikari: ఆ ప్రతీకారం వల్లేరిపబ్లిక్ డే పరేడ్కు నన్ను పిలవలేదు..!
గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్కు సీఎం మమతా బెనర్జీ తనను ఆహ్వానించలేదని బెంగాల్ ప్రతిపక్ష నేత, భాజపా నేత సువేందు .......
కోల్కతా: గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్కు సీఎం మమతా బెనర్జీ తనను ఆహ్వానించలేదని బెంగాల్ ప్రతిపక్ష నేత, భాజపా నేత సువేందు అధికారి అన్నారు. నందిగ్రామ్లో తన చేతిలో పరాజయాన్ని మమత ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనచేతిలో ఓటమికి ప్రతీకారంగానే ఈరోజు రెడ్ రోడ్ పరేడ్ ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తప్పించారని ఆరోపించారు. క్యాన్సర్కు కూడా మందు ఉందన్న సువేందు అధికారి.. ప్రతీకారేచ్ఛ స్వభావం, అసూయలకు మాత్రం ఉండదన్నారు. ప్రతిపక్ష నేతను పరేడ్కు ఆహ్వానించకపోవడం ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధమని ఆమె మరిచిపోయి ఉంటారని వ్యాఖ్యానించారు. గతేడాది ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత అబ్దుల్ మాన్ను ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మరోవైపు, రెడ్ రోడ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్కర్, కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకలను నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM