ఆరోపణలు తీవ్రమైనవే..శరద్ పవార్
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.
లోతైన దర్యాప్తు అవసరమన్న ఎన్సీపీ అధినేత
ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణల దర్యాప్తు, చర్యల విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకుంటారని శరద్ పవార్ వెల్లడించారు. మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ఎన్సీపీ నేతపై ఆరోపణలు రావడంపై శరద్ పవార్ దిల్లీలో మాట్లాడారు.
‘పరమ్బీర్ సింగ్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రేతో చర్చించాను. దీనిపై దర్యాప్తు చేసేందుకు మాజీ ఐపీఎస్ అధికారి జులియో రిబెయిరో సహాయం తీసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించాను’ అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పవార్ వెల్లడించారు. ముంబయి పోలీసు కమిషనర్ పదవి నుంచి హోంగార్డుల విభాగానికి మార్చి 17న బదిలీ చేసిన తర్వాతే పరమ్బీర్ ఈ ఆరోపణలు చేసినట్లు శరద్ పవార్ గుర్తుచేశారు. అయితే, మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపించదని ఆయన అన్నారు. కేవలం మహా వికాస్ అగాఢీ ప్రభుతాన్ని అస్థిరపరచేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ, చివరకు అవి వృథానే అవుతాయని పేర్కొన్నారు.
ముంబయి నగరంలోని బార్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ నిర్దేశించారని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా పరమ్బీర్ కూడా అంగీకరించారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తాజా పరిణామాలపై ‘మహా వికాస్ అగాఢీ’ కూటమి భేటీ అయి చర్చించే అవకాశం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?